ఎంపీ రఘురాం రెడ్డి కృషితో..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 3, తెలంగాణ ముచ్చట్లు:
పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పార్లమెంట్ లో చర్చించి, మంజూరు చేయాల్సిందిగా.. గతంలో కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో..తాజాగా కేంద్రం స్పందించి మంజూరు చేసింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి.. నాలుగు కేటాయించగా.. అందులో ఒకటి భద్రాద్రి జిల్లాకు దక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలప్పుడు.. ఆదివాసీ బిడ్డల విద్యాభివృద్ధి కోసం కేంద్రం చొరవ చూపాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ముందుకు రావాలని కోరగా చేసిన అభ్యర్థనలు ఫలించాయి. ఎంపీ రఘురాంరెడ్డి చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరవడం పట్ల.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నేతలు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.


Comments