నాచారం సర్కిల్ను మల్లాపూర్ సర్కిల్గా పునర్వ్యవస్థీకరించాలి
జిహెచ్ఎంసి కమిషనర్కు కార్పొరేటర్ల వినతి
నాచారం, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ను మీర్పేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నాచారం సర్కిల్ కార్యాలయాన్ని మల్లాపూర్ సర్కిల్గా పునర్వ్యవస్థీకరించాలంటూ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సౌలభ్యం దృష్ట్యా సర్కిల్ కార్యాలయాన్ని మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేయడం అత్యవసరమని కమిషనర్కు వివరించారు. మల్లాపూర్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణాభివృద్ధి, పరిపాలనా ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుంటే ఈ మార్పు అవసరమని తెలిపారు.సర్కిల్ కార్యాలయం మల్లాపూర్లో ఏర్పాటు చేస్తే పరిపాలనా సామర్థ్యం మరింత పెరిగి, అధికారుల మధ్య సమన్వయం మెరుగవుతుందని, ప్రజల ఫిర్యాదులకు వేగంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అన్ని డివిజన్లకు కేంద్ర బిందువుగా మల్లాపూర్ సర్కిల్ ఉపయోగపడుతుందని కమిషనర్తో జరిగిన చర్చలో వారు స్పష్టం చేసినట్లు తెలిపారు.


Comments