నాచారం వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
నాచారం,డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
సమాజ సేవలో తమ వంతు బాధ్యతగా సేవలందించాలనే సంకల్పంతో ఏర్పాటైన శ్రీ వాసవి సేవా సమితి పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. నాచారం వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.2016 సంవత్సరంలో కేవలం 17 మంది సభ్యులతో ప్రారంభమైన వాసవి సేవా సమితి నేడు వంద మందికి పైగా సభ్యులతో విస్తరించడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ, కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసి ఆదుకున్నారు.ప్రతి అమావాస్య రోజున నాచారం మహంకాళి దేవాలయం వద్ద సుమారు 1200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని సమితి నిర్వాహకులు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా వాసవి సేవా సమితి నిర్వాహకుడు శ్రీరామ్ సత్యనారాయణను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా వాసవి సేవా సమితి ముందుకు సాగుతుందని సభ్యులు పేర్కొన్నారు.


Comments