తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..
మండల టాస్క్ఫోర్స్ మీటింగ్ ..
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
తల్లాడ మండల పరిషత్ కార్యాలయము నందు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండల టాస్క్ఫోర్స్ మీటింగ్ జరిగినది ఈ సమావేశము నందు ఆగస్టు 11వ తేదీ నాడు అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు ,జూనియర్ కళాశాలలో మరియు అంగనవాడి కేంద్రాలలో నులిపురుగుల నివారణ మాత్రలు అయినా ఆల్బెండజోల్ మాత్రలను వేయటం జరుగుతుంది వైద్యాధికారి డాక్టర్ కే ప్రత్యూష తెలియజేశారు.ఆరోజు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి , చేతులు శుభ్రం చేసుకోవడం గురించి వివరించి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఈ మాత్రలను వేయడం జరుగుతుందని తెలియజేశారు.
నులిపురుగులు మాత్రలు వేసుకోవడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, దానివల్ల విద్యార్థులు చదువులో ముందుంటారని చురుకుదనం ఉంటుందని, అదేవిధంగా వారిలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని తెలియజేసినారు. ఆగస్టు 11వ తేదీ నాడు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొని ఈ నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీ కే సురేష్ కుమార్ , ఎంపీడీవో సురేష్ బాబు , హెల్త్ సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ రత్నకుమారి, విద్యా శాఖ శివ పాల్గొన్నారు.


Comments