చండీశ్వర్ నగర్ కాలనీలో కొత్త కమాన్ ప్రారంభం

మాజీ చైర్మన్ చంద్రారెడ్డి 

చండీశ్వర్ నగర్ కాలనీలో కొత్త కమాన్ ప్రారంభం

నాగారం, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని చండీశ్వర్ నగర్ కాలనీలో కొత్తగా నిర్మించిన కమాన్‌ను ఘనం గా ప్రారంభించారు. ఈ కమాన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగారం మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో  మెరుగు శ్రీనివాస్ రెడ్డి, అలాగే కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.అతిథులు మాట్లాడుతూ – కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు సంతోషకరమని, భవిష్యత్తులో కూడా మౌలిక వసతుల కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.కాలనీ నివాసులు కమాన్ నిర్మాణంతో తమ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .