రైల్వే అలైన్ మెంట్ మార్పు కోరుతూ ఎంపీ రఘురాం రెడ్డికి వినతి
Views: 20
On
ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
కొత్తగా మంజూరైన డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్పునకు కృషి చేయాలని కోరుతూ.. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డికి ఆయా మండలాల రైతుల తరఫున ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఈ రైల్వే లేన్ రానుందని.. విలువైన వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. రైతులకు మేలు జరిగేలా అలైన్ మెంట్ మార్చాలని కోరారు. సమస్యను పూర్తిగా విన్న ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. తప్పకుండా రైల్వే జీఎం, కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అభయమిచ్చారు.
ఈ కార్యక్రమం లో తిరుమలాయపాలెం కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లం శ్రీను, నాయకులు కొప్పుల చంద్రశేఖర్, సాదిక్, పోట్ల యోగేందర్, ఉప్పల్ రావు, పుచ్చకాయల సుధాకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments