రైతుల ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన.!

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి.

రైతుల ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన.!

సత్తుపల్లి, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం సాగు సీజన్‌లో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, దళారుల దోపిడీని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాటా, రేటు, బస్తాల విషయంలో రైతులకు న్యాయం జరిగేలా పర్యవేక్షణ పెంచాలని కోరారు.

ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. అదనంగా ఇందిరమ్మ ఇళ్లు సంబంధిత బిల్లుల సమస్యలు, ఇంకా కట్టని ఇళ్లను లబ్ధిదారుల ఆమోదంతో కొత్త అర్హులైన వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

నియోజకవర్గ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే మట్టా రాగమయి విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .