రాజోలి–శాంతినగర్ రహదారి చెరువుగా మారిన వైనం
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
జోగులాంబ గద్వాల్,సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
రాజోలి మండల కేంద్రం నుండి శాంతినగర్ వైపు వెళ్లే రహదారి వర్షపు నీటితో గుంతలు నిండిపోయి చెరువులా మారింది. ఈ రహదారిని ఉపయోగించే గ్రామస్తులు, రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లల స్కూల్ బస్సులు కూడా సరిగా నడవలేక ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
“ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సులు, ఆటోలు సరిగా నడవట్లేదు,” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుంగభద్ర నది ప్రవాహం, రాజోలి రిజర్వాయర్ కారణంగా వర్షాకాలంలో రహదారులు మరింత దెబ్బతింటున్నాయని ప్రజలు చెబుతున్నారు. తక్షణం చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.


Comments