ప్రజా సమస్యలపై సెక్రటేరియట్ ముట్టడించిన కార్పొరేటర్ శ్రవణ్

ప్రజా సమస్యలపై సెక్రటేరియట్ ముట్టడించిన కార్పొరేటర్ శ్రవణ్

WhatsApp Image 2025-08-22 at 8.37.58 PMమల్కాజ్గిరి, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)

నగరంలో పెరుగుతున్న ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సెక్రటేరియట్ ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన సేవ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఈ ఆందోళన జరిగింది.ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు

శ్రవణ్ మాట్లాడుతూ –
వర్షం పడితే ప్రతి కాలనీ చెరువుల్లా మారిపోతుందని, వీధుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.కాలువలు మూసుకుపోవడం, డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల దుర్వాసనతోపాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు తరచుగా జరుగుతున్నప్పటికీ, బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

విభాగాలపై విమర్శలు
హైడ్రా, జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్ వంటి విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు.
నగరంలో కొత్త భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో, రక్షిత మంచినీరు సరఫరా చేయడంలో వాటర్ వర్క్స్ పూర్తిగా విఫలమైందని అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సాధారణ ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్ ఉద్యమ హెచ్చరిక:
ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే –వాటర్ బోర్డు,విద్యుత్ బోర్డు, జిహెచ్ఎంసి కార్యాలయాలను కూడా ముట్టడించడానికి వెనుకాడబోమని శ్రవణ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నందు యాదవ్, మురళి గౌడ్, నాని, చెన్నా రెడ్డి, సంజీవ్, శ్రీనివాస్, వివేక్, షాగంటి శ్రీనాథ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .