శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం
మల్కాజిగిరి, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్లో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయంలోని ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మణికంఠ శర్మ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – సంతానం, వివాహం, ఉద్యోగం, కాలసర్పదోషం, నవగ్రహ దోష నివారణ కోసం భక్తులు సంకల్పం చేసి స్వామివారికి అభిషేకం నిర్వహించారని తెలిపారు.
అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆలయ ఈఓ పి. శ్రీకాంత్ ఆశీర్వదించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఆలయ చైర్మన్ దాసరి అమర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుభ్రమణ్యేశ్వర స్వామి వారి దర్శనం పొందారు.


Comments