అంతర్జాతీయ అవుట్రిచ్ అవార్డును సాధించిన శ్రీవిద్యను
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సత్కరించారు
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరేడ్మెట్ డివిజన్ కు చెందిన శ్రీవిద్య బడే వినోద్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ శనిసినాటీ ఒహియో (యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి , ఒహియో, యుఎస్ఎ)ప్రఖ్యాత డార్విన్ టి. టర్నర్ స్కాలర్ షిప్,
అంతర్జాతీయ అవుట్రిచ్ అవార్డును సాధించినందుకు శ్రీవిద్యను సత్కరించారు. శ్రీవిద్య తన 16 సంవత్సరాల చిన్న వయసులో అమెరికా లాంటి దేశంతో పోటీపడి అవార్డు సాధించడం మొట్టమొదటి దళిత విద్యార్థి కావడం అది మన మల్కాజ్గిరి వాస్తవ్యులు కావడం విశేషమ ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ అవార్డు సాధించడం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బిట్ల వెంకటేశ్వర్లు,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ ఎస్టీ పిఓఏ ఆక్ట్ డివిఎంసి మెంబర్ దుంపల శరణ్ గిరి శ్రీవిద్య తల్లిదండ్రులు వినోద్ కుమార్, నవిత తదితరులు పాల్గొన్నారు.


Comments