నాగారంలో చిడంబ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ ప్రారంభం
నాగారం, తెలంగాణ ముచ్చట్లు:
తైక్వాండో శిక్షణ ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాగారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గూడూరు ఆంజనేయులు తెలిపారు. నాగారం పురపాలక సంఘం 7వ వార్డులో విజయ్ హాస్పిటల్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన చిడంబ్ తైక్వాండో అకాడమీ ఇన్స్టిట్యూట్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మహిళలు కూడా అనుకోని దాడుల నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. కరాటే వలె తైక్వాండో గొప్ప క్రీడ అని, ఇందులో శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయని పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ విధమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.
చిడంబ్ తైక్వాండో అకాడమీ యాజమాన్యం సమర్థవంతంగా శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలకు నాణ్యమైన శిక్షణ అందించాలని ఆయన కోరారు
అనంతరం గూడూరు ఆంజనేయులను శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఎ. ప్రవీణ్ కుమార్, మాస్టర్ ఎ. కిషోర్ కుమార్, అకాడమీ యాజమాన్యం, ఇతరులు పాల్గొన్నారు.


Comments