లింగాలపల్లిలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల సమ్మేళనం.

మంత్రి తుమ్మలతో పాటు పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

అశ్వారావుపేట, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

దమ్మపేట మండలంలోని లింగాలపల్లి గ్రామంలో రేపు (శనివారం) ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ సాగు జరుగుతున్న నియోజకవర్గాల శాసనసభ్యులు హాజరు కానున్నారు.

ఈ రాష్ట్రస్థాయి సమ్మేళనం ప్రధాన ఉద్దేశం తెలంగాణను పామాయిల్ హబ్‌గా అభివృద్ధి చేయడమే. భవిష్యత్తులో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా పామాయిల్ కనీస మద్దతు ధర, ఉత్పత్తి, క్రషింగ్, సాగు ప్రోత్సాహకాలు, రాయితీలు వంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కార మార్గాలపై చర్చించడం జరుగనుంది.

ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .