విద్యార్థులకు 108 అంబులెన్స్ ద్వారా సిపీఆర్ పై అవగాహన

విద్యార్థులకు 108 అంబులెన్స్ ద్వారా సిపీఆర్ పై అవగాహన

పెద్దమందడి,అక్టోబర్16(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడిలోని జీవీకే ఈఏంఆర్ఐ 108 అంబులెన్స్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుండె పనిచేయకపోవడంలో తక్షణ సహాయం (సిపీఆర్) పై అవగాహన శిక్షణ నిర్వహించారు.ఈ శిక్షణలో గుండెపోటు వచ్చినప్పుడు లేదా గుండె పనితీరు ఆగిన సందర్భాల్లో తక్షణ సహాయం ఎలా అందించాలో విద్యార్థులకు వివరించారు. ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది గుండెపోటు మరియు గుండె ఆగిపోవడంలో తక్షణ సహాయ పద్ధతుల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రాక్టికల్ డెమో ద్వారా చూపించారు.ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే పద్ధతులు గురించి అవగాహన పెంచుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, 108 సిబ్బంది భాస్కర్, యోగేశ్వర్, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయ శాంతన్న, 108 వనపర్తి జిల్లా మేనేజర్ మెహబూబ్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .