విద్యార్థులు పై చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ
1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు 1991- 1992 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు టై, బెల్టులు పంపిణీ చేశారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్వ విద్యార్థులు పాల్గొని విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... సామాజిక స్పృహతో తాము చదువుకున్న బడిలో విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో... విద్యార్థులను ప్రోత్సహించేందుకు అందరం కలిసి విద్యార్థులకు ఈ చిన్న సహాయం చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు వారికి కావలసిన వసతులు కల్పిస్తే మరింత చదువుపై దృష్టి పెట్టేందుకు అలాగే ప్రభుత్వ పాఠశాల సంఖ్యను పెంచేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు పై చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని 1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులకు సూచించారు. అనంతరం పదవ తరగతి ఫలితాల్లో బెస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినీలకు నగదు బహుమతులు అందజేశారు.
మొదటి ర్యాంకు విద్యార్థినికి 3000/- రెండవ ర్యాంకు విద్యార్థినికి 1500/- మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థినికి 1500/- రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేసి విద్యార్థినీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ శ్రీనివాస్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, శాంతయ్య, బండారి నరసింహ, మద్దూరు ఆంజనేయులు, వెంకటేష్, చెన్నయ్య, జగదీశ్వర్ రెడ్డి, నరహరి, పారిజాతమ్మ, అడివన్న, రుక్మద్దీన్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


Comments