చేగువేరా 58వ వర్ధంతి  సంస్మరణ సభ

చేగువేరా 58వ వర్ధంతి  సంస్మరణ సభ

ఏ ఎస్ రావు నగర్, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా 58వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం కమలానగర్ ఆఫీసులో సంస్మరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించారు. సీనియర్ నాయకులు ఉదయ భాస్కర్ చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఉదయ భాస్కర్ మాట్లాడుతూ — ప్రపంచ యువకులకు ఐకాన్‌గా నిలిచిన చేగువేరా క్యూబా విప్లవాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఫెడరల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబాలో సోషలిజం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక వహించిన ఆయన, తరువాత లాటిన్ అమెరికా దేశాలలో కూడా విప్లవాలకు మార్గదర్శకుడయ్యారని అన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా పోరాట దీక్షతో చివరి వరకు రణరంగంలో నిలిచిన చేగువేరా నిజమైన ప్రపంచ విప్లవకారుడని ఆయన గుర్తుచేశారు.స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ, గొడుగు యాదగిరి రావు కూడా ప్రసంగించి చేగువేరా సేవలను స్మరించారు. అనంతరం పాల్గొన్న వారందరూ చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, నవతెలంగాణ రవి, గౌసియా, శోభ, ఉదయ భాస్కర్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .