సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి సరికాదు – మాజీ ఎంపీ నామ

సుప్రీం కోర్టు సీజేఐ పై దాడి పట్ల మాజీ ఎంపీ నామ ఖండన 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి సరికాదు – మాజీ ఎంపీ నామ

ఖమ్మం బ్యూరో, అక్టోబర్‌ 7, తెలంగాణ ముచ్చట్లు;

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్‌ గవాయ్‌పై జరిగిన దాడి సంఘటనను బిఆర్ఎస్‌ మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థపై దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు సరికాదన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిపై దాడి ప్రయత్నం జరగడం ఆందోళనకరమని నామ అన్నారు. ప్రజల న్యాయహక్కులను కాపాడే న్యాయమూర్తులపై దాడి ప్రయత్నం దేశ ప్రజాస్వామ్య గౌరవాన్ని దెబ్బతీసిన చర్యగా అభివర్ణించారు. దాడి యత్నం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమూర్తుల భద్రతను మరింత పటిష్టపరిచి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టడంలో ప్రభుత్వం, న్యాయవర్గాలు, ప్రజాసంఘాలు సమన్వయంతో ముందుకు రావాలని నామ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .