వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు

జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది

వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు

 జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

వనపర్తి,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వనపర్తి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం స్థాపన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా ప్రజల స్వప్నం నెరవేరింది” అని తెలిపారు.అలాగే, కేంద్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ – “కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, నిధులను ప్రభుత్వం త్వరగా కేటాయించేటట్లు చూసి, పనులు వేగంగా పూర్తయ్యేలా కృషి చేస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .