ఇందిరా ఫెలోషిప్ ప్రతినిధుల కృషి అభినందనీయం. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇందిరా ఫెలోషిప్ ప్రతినిధుల కృషి అభినందనీయం. 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

 మహిళా సాధికారతకు, అన్ని రంగాల్లో వారు రాణించేందుకు ఇందిరా ఫెలోషిప్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  మంగళవారం కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో ఇందిరా ఫెలోషిప్ సభ్యులతో సంభాషించారు. మహిళలను రాజకీయ రంగంలోకి ప్రోత్సహించేందుకు, అలాగే సామాజిక, ఆర్థిక రంగాల్లో వారికి స్వతంత్రతను అందించేందుకు రూపొందించబడిన ఈ జాతీయ కార్యక్రమం మహిళా సాధికారతకుదోహదపడుతోంది.

తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఇందిరా ఫెలోషిప్ సభ్యులు, మహిళల రాజకీయ, ఆర్థిక శక్తి వృద్ధి కోసం చేపట్టిన తమ కార్యకలాపాలు, ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సల్ల సౌజన్య, చరిత్రలో ఎం.ఏ చేసిన ఈ.వి. సాత్త్విక, దేవరకొండ ఎం.పి.టి.సి కొర్రా గౌతమీ, జహీరాబాద్ నుండి డాక్టర్ ఆస్మా తబస్సుం, రాజకీయ శాస్త్రంలో ఎం.ఏ చేసిన కె. నిహారిక ఉన్నారు.

ఈ సభ్యుల కృషిని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు మహిళలు అందరూ సామాజికంగా, ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .