పట్టా భూమిని అక్రమించి గుడిసెలు వేశారు

తొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారు

పట్టా భూమిని అక్రమించి గుడిసెలు వేశారు

అన్ని హక్కులు ఉన్న నా భూమికి రక్షణ కల్పించాలి

స్థానికేతరుల దాడులపై చర్యలు తీసుకోవాలి

మీడియా సమావేశంలో భూ యజమాని వేజళ్ల సురేష్ కుమార్ 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 తన పట్టా భూమిలో గుడిసెలు వేసి తొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారని భూ యజమాని వేజళ్ల సురేష్కుమార్ తెలిపారు. కొంత మంది పేదల ముసుగులో స్థానికేతర అరాచక శక్తులను పోగేసి పట్టా భూములు అక్రమిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు.  

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు బుధవారం చేసిన విలేకరుల సమావేశంలో వెజళ్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ.. తాను పోతుల వెంకటేశ్వర్లు, సీతయ్య అనే వ్యక్తుల నుంచి సర్వే నెం. 148లో మూడు ఎకరాల ఎనిమిది కుంటలు, సర్వే నెం.149లో ఐదు ఎకరాలను కొనుగోలు చేశానని చట్టబద్దంగా లే అవుట్ అనుమతులు తీసుకున్నానని ఇందుకు గాను రూ. 30లక్షలు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించానని ఆయన తెలిపారు. కొద్ది రోజులుగా భూ దాన్ ల్యాండ్ పేరుతో భూములు అక్రమించిన స్థానికేతరులు దానిని ఒక వ్యాపారంగా మార్చుకుని పక్కనే ఉన్న నా భూమిలో గుడిసెలు వేసి విక్రయిస్తూ తాను అడ్డుకుంటే అసాంఘిక శక్తులతో దాడులు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు నా వాహనాన్ని ధ్వంసం చేశారని చట్ట ప్రకారంగా ఆ భూమిపై అన్ని హక్కులు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎప్పుడో రద్దయినా భూదాన్ ట్రస్టు బోర్డు పేరుతో ఫోర్జరీ పట్టాలు సృష్టించి పేదల మాటున లక్షలు దోచుకునే కొందరు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అధికారులు పూర్తి విచారణ చేసి తన భూమికి రక్షణ కల్పించాలని తనపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థాన పరంగా భూమిపై అన్ని హక్కులు నాకే ఉన్నట్లు తీర్పునిచ్చారని ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులపై ఉందని తక్షణం నా పట్టా భూమిలో వేసిన గుడిసెలను తొలగించి నాకు న్యాయం చేయాలని సురేష్కుమార్ కోరారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిన కారణంగా తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని ఇకనైనా పోలీస్, రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో దిరిశాల వెంకటేశ్వరరావు, బండి జయకిషోర్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .