మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం 

అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి

మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం 

హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు:

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మహనీయుల జీవితం నేటి తరానికి ఆదర్శమని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దొడ్డి కొమురయ్య వర్దంతి సందర్భంగా నిర్వహించిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన తొలి అమరుడని, అతని త్యాగం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం గొప్ప ప్రేరణగా నిలుస్తుందన్నారు.WhatsApp Image 2025-07-04 at 10.00.46 PM

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, కార్పొరేటర్ మానస రాంప్రసాద్, బీసీ సంఘ నాయకులు ఏ. శ్రీనివాస్ యాదవ్, బి. శ్యామ్ యాదవ్, పి. రమేష్, బిక్షపతి, కె. ప్రకాష్, నరసింహులు, అంకయ్య, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .