విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉప కేంద్రం నిర్వహణ తీరును, ఫ్యూజ్ కనెక్షన్, విద్యుత్ డిమాండ్, తదితరాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.లాగ్ బుక్ ను తనిఖీ చేసి, రికార్డుల్లో వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని,అలాగే ఆన్లైన్ లో కూడా పొందుపరచాలని,అదే విధంగా విద్యుత్ ప్రజావాణి గురించి ఆరా తీసి విద్యుత్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,ట్రిప్ అయితే వెంటనే స్పందించాలని,వేసవి కాలంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా,విద్యుత్ కొరత రాకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని,ఈ క్రమంలో విద్యుత్ అధికారులు వివరిస్తూ నియోజకవర్గ పరిధిలో 10 సబ్ స్టేషన్ లు ఉన్నాయని, సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ రాకేష్, ఆపరేటర్ నయీం, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .