ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

మాల్ సిబ్బంది, యాజమాన్యానికి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సూచన.

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

సత్తుపల్లి, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):

రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా సత్తుపల్లి పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సత్తుపల్లి పట్టణంలోని జీవి షాపింగ్ మాల్‌లో నిర్వహించారు. మాల్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. అలాగే మాల్ యాజమాన్యం తమ సిబ్బంది ట్రాఫిక్ నియమాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు.
ఇదే విధంగా సత్తుపల్లి పట్టణంలోని అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థల యాజమాన్యాలు కూడా తమ వద్ద పనిచేసే సిబ్బంది రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఐ కోరారు.
కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్ కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు, ప్రమాద మరణాలు తగ్గించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.IMG-20260124-WA0027

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.