గిరిజన మోర్చా కొత్త అధ్యక్షుడు రవి నాయక్ పదవి బాధ్యతలు స్వీకరణ

గిరిజన మోర్చా కొత్త అధ్యక్షుడు రవి నాయక్ పదవి బాధ్యతలు స్వీకరణ

చర్లపల్లి, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా కొత్త పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం నాంపల్లిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ను గిరిజన మోర్చా నాయకుల తరఫున అభినందిస్తూ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో గిరిజన మోర్చా సీనియర్ నాయకులు అమర్ సింగ్ పవర్, ఉమామహేశ్వరి, మీ ఇస్లావత్, హరి నాయక్, మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కిషన్ నాయక్, పడితియా నాయక్, సుధాకర్ నాయక్, వెంకట్ నాయక్ మరియు అనేక ఇతర ప్రముఖ నాయకులు పాల్గొని, రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం తనవారి ప్రాతినిధ్యం మరియు మద్దతును ప్రకటించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు నేనావత్ రవి నాయక్ గిరిజనుల సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తారని, మద్దతుగా నిలబడతారని తెలిపారు. అలాగే, సమాజంలోని యువత, మహిళలు, గిరిజన సముదాయాల కలయిక ద్వారా రాష్ట్ర స్థాయిలో పలు సామాజిక, ఆర్థిక ప్రాజెక్టులు విజయవంతం కావడానికి పనిచేయనున్నట్టు ఆయన ఆలోచన వెల్లడించారు.కార్యక్రమం సౌహార్దమయంగా, గిరిజనుల ఉత్సాహభరితంగా ముగిసింది. స్థానికులు, నాయకులు తమ అభినందనలు వ్యక్తం చేసి, గిరిజన మోర్చా అభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం కొనసాగించే కార్యాచరణకు పూర్ణ మద్దతు ప్రకటించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .