కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ..

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పౌష్టికాహారం అందించాలి.

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ..

 జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ WhatsApp Image 2024-12-16 at 8.57.06 PM (1)

మెదక్ జిల్లా ప్రతినిధి,తెలంగాణ ముచ్చట్లు :

 టేక్మాల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి  రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కస్తూర్బా బాలికల పాఠశాలలో పరిసరాలను పరిశీలించి  పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో  వంట వంటగదిని స్టోర్ రూమ్ ని కూరగాయలను  బియ్యాన్ని పప్పులు వంట సరుకులను డీఇవో పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి ఇప్పుడు భోజనం ఎలా ఉంటుంది పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనం సమయానికి  పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ. విద్యార్థులకు పోషకాలతో కూడిన బలవర్ధక నాణ్యమైన భోజనం పోషకాహారంతో పాటు విద్యను అభ్యర్థించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు మంచిగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నామని భావనను దరి చేరనివ్వకుండా మంచిగా చదువుకుని జీవితంలో కన్నవారి కలలు నిజం చేయాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చక్కగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యతోపాటు   ప్రభుత్వ నిర్దేశించిన విధంగా మెనూ ప్రకారం  ఉదయం టీ. టిఫిన్  మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పౌష్టికాహారం  విద్యార్థులకు సమయానికి అందించాలని వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని కస్తూర్బా గాంధీ పాఠశాల సిబ్బందికి సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .