15వ పటాలములో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
సత్తుపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామంలోని 15వ పటాలములో మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్ కమాండెంట్ ఎన్.పెదబాబు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఆదికవిగా, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహాకవిగా రామాయణ మహాకావ్యాన్ని రచించారని, ఆయన ఆచార–విచారాలు ప్రతి భారతీయుడు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఇలాంటి మహనీయుల జయంతులు జరుపుకోవడం ద్వారా యువతకు సత్ప్రేరణ లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు దళాధిపతి ఏ.అంజయ్య, సహాయ దళాధిపతులు వై.శ్రీధర్ రాజా, వై.డి.రంగారెడ్డి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


Comments