ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.

ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు.చింతకాని మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్థానిక ప్రజలకు,రాజకీయ నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు.సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ అభ్యర్థులందరూ సామరస్య పూర్వకంగా ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలని కోరారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు.నియమ నిబంధనలు పాటించకపోతే కేసులు సైతం నమోదు అవుతాయని తెలిపారు. అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు జరుపుకోవాలని,ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు సూచించిన సమయంలోనే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి పోలీసులకు సహకరించాలని కోరారు.ముఖ్యంగా ఎన్నికలు, ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు గానిసమావేశాలకు గాని అనుమతి లేదని,ఇది గమనించి అందరూ సహకరించాలని అన్నారు.ఈ సమావేశంలో ఏసీపీ సాంబరాజు,సిఐ వెంకటప్రసాద్,ఎస్సై వీరేందర్ పాల్గొన్నారు. IMG-20251208-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం