దార్శనీకుడు రతన్ టాటా
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
రతన్ నావెల్ టాటా దేశం గర్వించదగ్గ ఒక జాతి రత్నం అని నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ పేర్కొన్నారు. పాఠశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రతన్ టాటా ఒక గొప్ప వ్యాపారవేత్త, మానవతావాది, కర్మయోగి అని ఆయన పేర్కొన్నారు. సమయపాలన, విలువ తెలిసిన వ్యక్తి ఆయన నిజమైన భారత రత్నం అన్నారు. నిజాయితీకి , ఈ దేశ కీర్తి ప్రతిష్టలను వ్యాపార దక్షతను ప్రపంచానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన సూచించారు. ఆయన మృతి పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించారు. రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments