మృతుల కుటుంబాలను పరామర్శ
నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ జావేద్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
రాఘునాధపాలెం మండలంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ జావేద్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో చిమ్మపూడి గ్రామ అధ్యక్షులు జోనబోయిన పాపయ్య కుమారుడు జోనబోయిన వెంకటేష్ ప్రేమ విఫలం చెంది ఆత్యహత్య చేసుకోవడంతో మృతిని నివాసానికి చేరుకొని వారి కుటుంబాన్ని ఓదార్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెంకటేష్ మృతి తీవ్ర దిగ్రాంతికి గురి చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేటి యువత ఓటమికి కుంగిగిపోవద్ధని గుండె ధైర్యంతో ముందుకు పోవాలని సూచించారు.తల్లి దండ్రులకు మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారని వారి కడుపుకోతకు కారణం కాకూడదని తెలియజేశారు. వెంకటేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని వెంకటేష్ మృతి గ్రామంలో పార్టీకి తీరని లోటని తెలిపారు.అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా కోటపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న భూపతిరావ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. పార్టీ తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


Comments