అమెరికాలో వేమన శతకం బోధన... మాతృభాషకు ప్రాధాన్యం.

అమెరికాలో వేమన శతకం బోధన... మాతృభాషకు ప్రాధాన్యం.

సత్తుపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

డల్లాస్ (అమెరికా): విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు మాతృభాషా బోధనలో భాగంగా వేమన శతక పద్యాలను కూడా నేర్పుతున్నారు. సత్తుపల్లి పట్టణానికి చెందిన అయ్యదేవర శేషగిరిరావు, మాదిరాజు మాలతి దంపతులు సోమవారం అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ పట్టణంలో గల కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో సృజన సాహితీ సమాఖ్య పంపిన వేమన శతక పుస్తకాలను అందజేశారు.

శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్థాపించిన ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం “బాలదత్త” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో బాల రామాయణం, బాల భారతం వంటి పురాణ కథలతోపాటు మాతృభాష బోధన కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృభాషా పఠనానికి ఉపయోగించే వేమన శతకం తోపాటు బాల సాహితీవేత్త ఉరిమళ్ల సునంద రచించిన తెలుగు వాచక పుస్తకాలను స్వచ్ఛంద శిక్షకులు దీప్తి, శరణ్యలకు శేషగిరి దంపతులు అందజేశారు.

విద్యార్థులకు మాతృభాషా బోధనలో ఈ పుస్తకాలను ఈ సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుస్తకాలను పంపిన సృజన సాహితీ సమాఖ్యకు, రచయిత ఉరిమళ్ల సునందకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సాయి ప్రకాష్, కౌశిక్ మరియు తెలుగు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.IMG-20251007-WA0003

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .