బలిజపల్లి గ్రామాన్ని వీలినం ఎత్తివేయాలి..లేనియెడల నిరసన దీక్ష కొనసాగిస్తాం
మాజీ సర్పంచ్ జయంతి
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామాన్ని విలీనం ఎత్తివేయాలని లేనియెడల నిరసన దీక్ష చేపడతామని బలిజపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జయంతి అన్నారు. మూడవరోజు మండల పరిధిలోని బలిజపల్లి గ్రామంలో నిరసన దీక్ష కొనసాగించారు. బలిజపల్లి గ్రామ ప్రజలు నిరసనలో దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీలీనం ఉప సవరించుకోవాలని వారు అన్నారు .లేని ఎడల జంట గ్రామాలలో ఘర్షణ వాతావరణ ఏర్పడుతుందని అన్నారు. కొన్ని ఏండ్ల నుండి బలిజపల్లి గ్రామం ఒక గుర్తింపుగా ఉందనే వారు అన్నారు .నూతన గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాతనే మా గ్రామం బలిజపల్లి అభివృద్ధి చెందిందని అన్నారు. జంగమయ్య పల్లె గ్రామంలో విలీనం చేస్తే సహించేది లేదని జోరుగా దీక్షకులం సాగిస్తామని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వం బలిజపల్లి గ్రామాల ప్రజలను అంశాన్ని ఆమోదించి వీలీనం ఉపసంహరించుకోవాలని వారు అన్నారు. వారితోపాటు గిరిజ. సత్య శిలా రెడ్డి. శశివర్ధన్ రెడ్డి. సంజీవరెడ్డి. నాగరాజు తో పాటు గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన దీక్షలో పాల్గొన్నారు.


Comments