జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా.
ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా లావుడియా రాజు నాయక్.
హాసన్ పర్తి,నవంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు):
ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టిడబ్ల్యూజేయు) రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాదులోని గిరిజన విద్యుత్ భవన్ లో కోర్ కమిటీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గా లావుడియా రాజు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా లావుడియా రాజు నాయక్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమించినందుకు రాష్ట్ర యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని, జర్నలిస్టుల సమస్యలను ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర కమిటీ ద్వారా అందరి సహకారంతో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తానని తెలిపారు.


Comments