నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్ర నేత ఏసోబు
కాజిపేట్ ,తెలంగాణ ముచ్చట్లు:
మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా బీజాపూర్ -- దంతేవాడ మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు దంతేవాడ పోలీసులు తెలిపారు. ఏసోబు స్వగ్రామం తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం గ్రామానికి చెందినవాడు. ఇతనికి భార్య మృతి చెందగా ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దొరల ఆగడాల ను తట్టుకోలేక వాళ్ళ దౌర్జన్యాలను ఎదిరిస్తూ 1990 లో మావోయిస్టు పార్టీలో చేరారు. అప్పటినుండి పార్టీలో చురుకైన పనితీరును కనిపిస్తూ అంచలంచలుగా ఆ పార్టీలో ఎదిగాడు. అన్యాయాలను అక్రమాలను తీవ్రస్థాయిలో ఎదిరిస్తూ ఎన్నో పోరాటాలను చేసిన చరిత్ర ఏసోబుకు ఉన్నది పార్టీలో మంచి గుర్తింపును తెచ్చుకొని వివిధ పదవులను చేపట్టితో పార్టీకి అటు అణగారిన ప్రజలకు తన సేవలను ఎంతగానో అందించారు. అతని మృతదేహాన్ని నేడు తన స్వగ్రామమైన టేకుల గూడెం కు తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


Comments