ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది 

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వైరా రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాలు, మున్సిపాలిటీ లోని నాలుగో వార్డ్ లో వరద ముంపు గురైన కాలనీలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. వరద ముంపు ప్రాంత వాసులతో మాట్లాడారు. రిజర్వాయర్ ను ఆనుకొని ఉన్న రాజీవ్ నగర్ కాలనీ రిజర్వాయర్లో తెప్పపై ప్రయాణించి కాలనీలోని సహాయక చర్యలను కలెక్టర్ పరిశీలించారు. వరద తగ్గేవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. వసతి గృహాంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సౌకర్యాలు మంచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్నట్లు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని, నిర్లక్ష్యంగా ఉండవద్దని అన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనర్ వేణు, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .