జర్నలిస్ట్ సమ్మయ్య సేవలు మరువలేనివి 

--- జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

జర్నలిస్ట్ సమ్మయ్య సేవలు మరువలేనివి 

IMG-20240909-WA0056--- సీనియర్ జర్నలిస్టు సమ్మయ్యకు ఘన నివాళి 

--- సమ్మయ్య కుటుంబ సభ్యులకు టియూడబ్ల్యూజే (టిజెఎఫ్) 12 వేల ఆర్థికసాయం

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు 

సీనియర్ జర్నలిస్ట్, వార్త ఖమ్మం కార్పొరేషన్ రిపోర్టర్ అబ్బుగాని సమ్మయ్య (48) సేవలు మరువలేనివని, ఆయన మరణం జర్నలిస్టు లోకానికి తీరనిలోటని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యతో సమ్మయ్య అకాల మరణం బాధాకరమన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో ముస్తఫా నగర్ లోని సమ్మయ్య నివాస గృహానికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమ్మయ్య కుటుంబ సభ్యులకు తక్షణసాయంగా 12 వేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీనియర్ జర్నలిస్టుగా సమ్మయ్య అందరికీ సుపరిచితులని, అందరితో కలివిడిగా ఉంటూ మంచి పేరు సంపాదించిన ఆయన మృతి చెందడం బాధాకరమని కొనియాడారు. 

యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, మారుతి సాగర్ లు స్పందించి అకాల మరణం పొందిన సమ్మయ్య కుటుంబానికి అండగా ఉండాలని, ప్రభుత్వం పరంగా అందాల్సిన సాయాన్ని సకాలంలో అందించే విధంగా కృషి చేయాలని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కీ గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, పిన్ని సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, నాయకులు వెంకటకృష్ణ, సాయి, రవీందర్, లక్ష్మణ్, డెస్క్ జర్నలిస్టులు ప్రసాద్, శివ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .