ఖమ్మంలో 'రామ' సహాయక చర్యలు..!

- ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ

ఖమ్మంలో 'రామ' సహాయక చర్యలు..!

- పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా వివరించిన ఆర్ ఆర్ ఆర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి వాటిని పరిష్కారించేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం నరేష్ రెడ్డి స్వయంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా ఈ రెండు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితిని వివరించారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. సహాయ బృందాలను రప్పించి వరదలకు ఇండ్లలో, రహదారుల పై చిక్కుకున్న వారిని కాపాడాలని సూచించారు. ఖమ్మంలోని పెద్దకూరగాయల మార్కెట్, జూబ్లీక్లబ్, కాల్వొడ్డుతో పాటు పాలేరులోని కరుణగిరి, జలగం నగర్, నాయుడుపేట, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి తదితర గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. వీలైనంత త్వరగా వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు యంత్రాంగం కృషి చేస్తుందని ఎంపీ రఘురాం రెడ్డి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .