కూతురుతో కలిసి యువ జర్నలిస్టు యోగి ఆత్మహత్య..!
వరంగల్ జర్నలిస్టు వర్గాల్లో విషాదం
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు :వరంగల్ యువ జర్నలిస్ట్, తొలి వెలుగు చానెల్ స్టాఫర్గా పనిచేస్తున్న యోగి రెడ్డి తన కూతురు ఆద్య(9)తో కలిసి హన్మకొండ ఏకశిల పార్కుకు సమీపంలోని తన ఇంట్లో శుక్రవారం ఉరివేసుకున్నాడు.
యోగి సంఘటన స్థలంలోనే మృతి చెందగా కూతురు ఆద్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. హన్మకొండలోని ఏకశిలా పార్కుకు సమీపంలో అద్దె రూంలో ఉంటున్న యోగి..శుక్రవారం ఉదయం నుంచే రూం నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం యోగి సన్నిహితులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో ఎంత పిలిచినా స్పందించకపోవడంతో అనుమానంతో డోర్లు తొలగించి చూశారు. యోగి ప్రాణాలు కోల్పోయి కనిపించగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆయన కూతురును కొంతమంది జర్నలిస్టులు, సన్నిహితులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. యోగి ఆత్మహత్యకు ఎందుకు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. కుటుంబ సమస్యలే కారణమా..? మరేదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.


Comments