ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం

  ఉప్పల్/ తెలంగాణ ముచ్చట్లు:
వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ఏఆర్.పిసి -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం జరిగింది.ఈ పోటీలలో దాదాపు 30 దేశాల నుండి దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు ఐపీఎస్ సంజీవ్ కుమార్ ను అభినందించి సత్కరించారు.ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ,వివిధ క్రీడలలో ఇలాగే తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .