కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణిలో 114 ఫిర్యాదులు స్వీకరణ

సకాలంలో సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు కలెక్టర్

కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణిలో 114 ఫిర్యాదులు స్వీకరణ

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 114 అర్జీలు అందాయని ఆయన తెలిపారు.సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో అందిన వినతులపై తీసుకున్న చర్యలను వివరించి, ఒన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశాలుజారీ చేశారు.ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు.WhatsApp Image 2025-12-08 at 7.36.36 PM అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.అదనంగా, సీఎంఓ ప్రజావాణి పెండింగ్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలి అని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .