కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణిలో 114 ఫిర్యాదులు స్వీకరణ

సకాలంలో సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు కలెక్టర్

కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణిలో 114 ఫిర్యాదులు స్వీకరణ

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 08 (తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్వీకరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 114 అర్జీలు అందాయని ఆయన తెలిపారు.సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో అందిన వినతులపై తీసుకున్న చర్యలను వివరించి, ఒన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశాలుజారీ చేశారు.ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు.WhatsApp Image 2025-12-08 at 7.36.36 PM అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.అదనంగా, సీఎంఓ ప్రజావాణి పెండింగ్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలి అని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం