కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా

కాప్రా, నవంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక నగర్ ఫేస్–3 లో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి నవీన్ గౌడ్, బద్రుద్దిన్, ఇంద్రయ్య, మహేష్, గిల్బర్ట్, రవీందర్, చందు, అలాగే కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజేందర్, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .