సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్
Views: 3
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
సైబర్ మోసాల పెరుగుతున్న ముప్పుపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ సూచించారు. ప్రపంచం కరోనా మహమ్మారిని జయించినప్పటికీ, సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సైబర్ మోసాలకు గురికావడం ఎలా?
• అనవసరమైన లింకులపై క్లిక్ చేయడం.
• అధిక లాభాల ఆశతో పథకాలలో పెట్టుబడులు పెట్టడం.
• అపరిచిత వ్యక్తుల మెసేజులు లేదా ఫోన్ కాల్స్కు స్పందించడం.
మెట్టు శ్రీధర్ సూచనలు:
1. అనవసరమైన లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు.
2. ఆశకు లోనై, అనుమానాస్పదమైన స్కీములకు పెట్టుబడులు పెట్టకండి.
3. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజులు, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
4. సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుని ఇతరులకూ అవగాహన కల్పించండి.
“నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే ఎక్కువగా మోసపోతుండడం విచారకరం. అవగాహనతోనే ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొవచ్చు.” ప్రజలంతా చైతన్యవంతంగా ఉండి సైబర్ మోసాలను నివారించడంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments