తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొల్లెపాక రాజేష్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ, హన్మకొండ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు బొల్లెపాక రాజేష్ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూరుగుల నాగేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ ముచ్చట్లు తెలుగు దినపత్రిక సంపాదకుడు అయిన బొల్లెపాక రాజేష్, జర్నలిజం రంగంలో ఉన్నత సేవలు అందించడంతో పాటు మాదిగ సమాజ అభ్యున్నతికి చేసిన కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగేందర్ తెలిపారు.రాజేష్, హన్మకొండ జిల్లాలో ఒక సామాజిక కార్యకర్తగా ప్రజల మన్ననలు పొందారు. ఆయన అనుభవం, జర్నలిజం రంగంలో నైపుణ్యం, మాదిగ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి, ఫోరమ్ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఫోరమ్ కమిటీ పేర్కొంది.రాజేష్ మాట్లాడుతూ,ఈ బాధ్యతతో సమాజ సేవలో మరింత అంకితభావంతో ముందుకు సాగుతానన్నారు. మాదిగ జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంలో, వారి అభ్యున్నతికి కృషి చేయడంలో నా సహకారం కొనసాగుతుంది” అని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూరుగుల నాగేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


Comments