సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఉత్తమ ఉద్యోగులకు నగదు బహుమతులు.
సంస్థ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్న డీఎం సునీత .
Views: 38
On
సత్తుపల్లి, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అత్యధిక ఆదాయాన్ని సాధించిన కండక్టర్లు, ఇంధన పొదుపుతో కిలోమీటర్ల ప్రయాణం చేసిన డ్రైవర్లకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత, అగ్నిమాపక అధికారి వై. వెంకటేశ్వరరావు కలిసి 21మంది ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు.
ఈ సందర్భంగా డీఎం సునీత మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని, అధిక ఆదాయంతో పాటు ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో సహాయ మేనేజర్ పి. విజయశ్రీ, ఎంఎఫ్ఎస్ సాహితీ, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments