అట్టహాసంగా జరిగిన పట్టణ దినోత్సవ విజయోత్సవాలు
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
అబ్బురపర్చిన నృత్య రూపక కళా ప్రదర్శనలు కాళోజీ కళాక్షేత్రంలో వైభవంగా జరిగిన ప్రజా పాలన విజయోత్సవాలు.జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ దినోత్సవ వేడుకలు మంగళవారం కాళోజీ కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగాయి. ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం
గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, కార్పొరేటర్ రావుల కోమల వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సాంస్కృతిక ప్రదర్శనల ఆకర్షణ
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ మహిళలు, చిన్నారులు, విద్యార్థులు నిర్వహించిన కోలాటం, కూచిపూడి, జానపద నృత్యాలు, అన్నమాచార్య సంకీర్తనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
బ్యాంక్ లింకేజే చెక్కుల పంపిణీ
విధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, ఇందిరా మహిళ శక్తి నిర్వాహకులకు రూ. 8.79 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజే చెక్కులను మేయర్, కుడా చైర్మన్, కమిషనర్ అందజేశారు.పారిశుద్ధ్య కార్మికులు, డి.ఆర్.ఎఫ్ సిబ్బంది, మెప్మా సిబ్బంది వంటి వారిని శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రదర్శనలలో విజేతలకు కూడా ప్రత్యేక బహుమతులు అందజేశారు.
వరంగల్ జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన పాటలు, ప్రదర్శనలు కళాక్షేత్రాన్ని ప్రాణం పోసాయి. కళాభిమానులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, హన్మకొండ డిఆర్ఓ గణేష్, డిఆర్డీఓ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Comments