మంత్రి సీతక్క చొరవ.. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల దస్త్రంపై సీఎం సంతకం
Views: 13
On
హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ అందించింది. ఈ రెన్యువల్ పత్రాలు కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న సమయంలో, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని,సీఆర్టి రెన్యువల్ ఫైల్ను అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ చర్చల అనంతరం, గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రెన్యువల్ పత్రంపై సంతకం చేశారు. ఈ నిర్ణయానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments