అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం 

అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య గురువారం, హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో, ఎల్కతుర్తి మరియు భీమదేవరపల్లి మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ, ఎల్కతుర్తి జంక్షన్ వద్ద రెండు వైపులా లెవెలింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, వంగరలోని పీవీ విజ్ఞాన కేంద్రం పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

ఆర్ అండ్ బి పనుల వివరాలు కూడా అధికారులచే కలెక్టర్ కు తెలియజేయబడ్డాయి. పంచాయతీ రాజ్ శాఖ కార్యాలను కూడా త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలల ఆధునీకరణ పనులు సమర్థవంతంగా కొనసాగించాలనీ ఆదేశించారు. కలెక్టర్, కార్యాలయాల్లో ఏ పనులు పెండింగ్‌లో ఉంటే, వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆహ్వానించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్డీవో మేన శ్రీను, సీపీవో సత్యనారాయణ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ రవీందర్, కుడా ఈఈ భీం రావు, తహసీల్దార్లు ప్రవీణ్ కుమార్, జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .