జూబ్లీహిల్స్ లో రానున్నది..కాంగ్రెస్ ఘన విజయమే
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
* రాష్ట్ర మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్ తో కలిసి విస్తృత ప్రచారం
ఖమ్మం బ్యూరో, నవంబర్ 9, తెలంగాణ ముచ్చట్లు;
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రానున్నది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయమేనని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా.. గత 15 రోజులుగా ప్రచారం చేస్తున్న ఎంపి రఘురాం రెడ్డి.. ఆదివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి కొల్లూరు కాలనీలో.. విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విశేష కృషి జరుగుతోందని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని, అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేసేందుకు రేషన్ షాపు లు ఏర్పాటు చేశామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, నాయకులు భరత్, తదితరులు పాల్గొన్నారు.


Comments