కుషాయిగూడలో పోలీస్ అమరవీరుల స్మారక ర్యాలీ

కుషాయిగూడలో పోలీస్ అమరవీరుల స్మారక ర్యాలీ

కుషాయిగూడ, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఘనంగా ర్యాలీ నిర్వహించారు.కుషాయిగూడలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నుండి రాధిక ఎక్స్ రోడ్ వరకు ర్యాలీగా నడిచి పోలీస్ అమరవీరులత్యాగాలకు నివాళులర్పించారు. WhatsApp Image 2025-10-28 at 5.57.07 PM.రాధిక ఎక్స్ రోడ్ వద్ద విద్యార్థులు, పోలీసులు కలిసి అమరవీరుల త్యాగాలకు సంఘీభావంగా మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించారు.ఈ ర్యాలీలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, సాయిలు, విజయ, సతీష్‌తో పాటు కుషాయిగూడ పోలీస్ సిబ్బంది, పరిసర పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సజావుగా, విజయవంతంగా పూర్తయింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .