పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ 

పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ 

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. బుధవారం కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు.కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ పడిపోవడంతో స్థానిక పోలీసులను ఎన్డీఆర్ఎఫ్ బృందలను అప్రమత్తం చేశారు. జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగాప్రవహిస్తుండటంతోనీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా మున్నేరు వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అపప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .