సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కృషి కొనసాగుతున్నట్టు కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ డివిజన్ న్యూ విజయపురి కాలనీలో రూ. 1 కోటి 83 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీలో కొత్త మంచినీటి పైప్ లైన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగు పరిచే పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు.
ఉప్పల్ డివిజన్ను సమస్య లేని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్ కుమార్, కాలనీ అధ్యక్షులు వెంకటేశ్, తెల్కల మోహన్ రెడ్డి, నాగి రెడ్డి, పబ్బు నర్సింహ, సల్ల ప్రభాకర్ రెడ్డి, వర్కాల మదన్ గౌడ్, పాపయ్య, శంకరయ్య, పూస సతీష్, భాస్కర్, దానయ్య, నర్సింహ కురుమ, వెంకటేశ్వరరావు, పద్మ, సుమిత్ర, సావిత్రి, అండాలు తదితరులు పాల్గొన్నారు.


Comments